స్వల్ప విరామం | ఫణీంద్ర కుప్పిలి
స్వల్ప విరామం | ఫణీంద్ర కుప్పిలి
మానవుడు పరుగెడుతూనే ఉన్నాడు
పుట్టిన నుండీ గిట్టిన దాకా..
అరక్షణం కూడా విరామం ఎరుగక..
అలుపు సొలుపు లేకుండా..
అనుక్షం పరుగెడుతూనే ఉన్నాడు.
ఆకలి, దప్పికలతో ఆదిమ మానవుడు..
ఆకలి, దప్పికలని మరచి ఆధునిక మానవుడు..
అభివృద్ధి పేరిట
పరుగులెడుతూనే ఉన్నాడు..
అనితర సాధ్యమైన మేధోశక్తితో..
భూగర్భాన్ని తొలిచాడు..
అనంత సాగరాల్ని మధించాడు..
అణువుల నుండి అంతరిక్షం దాకా..
ప్రకృతిలో ప్రతిదాన్ని చెరపట్టి..
పంచభూతాల్ని
పాదాక్రాంతం చేసుకున్నాడు..
విరామం ఎరుగని నిత్యాన్వేషణతో
సంపదపై అంతులేని ఆశతో..
నిరంతరం పరుగులు తీస్తూనే ఉన్నాడు..
అడపాదడపా మానవుని శక్తి సామర్ధ్యాలకు
సవాళ్లు విసురుతున్న ప్రకృతి..
ఈసారి.. కంటికి కనిపించని..
సూక్ష్మాతి సూక్ష్మమైన శత్రువు రూపంలో
అతిపెద్ద సవాలు విసిరింది..
అనుక్షణం కాలంతో పోటీపడుతూ..
విరామ మెరుగక పరుగెడుతున్న
ఆధునిక మానవుడుకి..
హఠాత్తుగా లాక్ డౌన్ ప్రకటించింది..
ఇది మానవ మేధ
ఓటమి ఎంత మాత్రమూ కాదు..
ప్రకృతి ప్రసాదించిన స్వల్ప విరామం మాత్రమే..
విరామం లేనిదే..ఏకాంతం లేదు..
ఏకాంతం లేనిదే..ఆత్మ పరిశీలన లేదు..
ఆత్మపరిశీలన లేనిదే.. మోక్షం లేదు..
ఒక వ్యక్తిగా..
ఒక కుటుంబంగా
ఒక సమాజంగా..
మొత్తం మానవ ప్రాథమ్యాలను
తరచి చూసుకోవాల్సిన సమయమిది..
సలపరమెడుతున్న గాయాలను
నయం చేసుకోవడానికి..
ప్రకృతి తనకు తాను కల్పించుకున్న
స్వల్ప విరామమిది..
భూమిపై మానవ ఉనికిని
కాడుకోవడానికి..
ప్రకృతి ప్రసాదించిన నిర్బంధ
స్వల్ప విరామమిది..
6 ఏప్రిల్, 2020.
మానవుడు పరుగెడుతూనే ఉన్నాడు
పుట్టిన నుండీ గిట్టిన దాకా..
అరక్షణం కూడా విరామం ఎరుగక..
అలుపు సొలుపు లేకుండా..
అనుక్షం పరుగెడుతూనే ఉన్నాడు.
ఆకలి, దప్పికలతో ఆదిమ మానవుడు..
ఆకలి, దప్పికలని మరచి ఆధునిక మానవుడు..
అభివృద్ధి పేరిట
పరుగులెడుతూనే ఉన్నాడు..
అనితర సాధ్యమైన మేధోశక్తితో..
భూగర్భాన్ని తొలిచాడు..
అనంత సాగరాల్ని మధించాడు..
అణువుల నుండి అంతరిక్షం దాకా..
ప్రకృతిలో ప్రతిదాన్ని చెరపట్టి..
పంచభూతాల్ని
పాదాక్రాంతం చేసుకున్నాడు..
విరామం ఎరుగని నిత్యాన్వేషణతో
సంపదపై అంతులేని ఆశతో..
నిరంతరం పరుగులు తీస్తూనే ఉన్నాడు..
అడపాదడపా మానవుని శక్తి సామర్ధ్యాలకు
సవాళ్లు విసురుతున్న ప్రకృతి..
ఈసారి.. కంటికి కనిపించని..
సూక్ష్మాతి సూక్ష్మమైన శత్రువు రూపంలో
అతిపెద్ద సవాలు విసిరింది..
అనుక్షణం కాలంతో పోటీపడుతూ..
విరామ మెరుగక పరుగెడుతున్న
ఆధునిక మానవుడుకి..
హఠాత్తుగా లాక్ డౌన్ ప్రకటించింది..
ఇది మానవ మేధ
ఓటమి ఎంత మాత్రమూ కాదు..
ప్రకృతి ప్రసాదించిన స్వల్ప విరామం మాత్రమే..
విరామం లేనిదే..ఏకాంతం లేదు..
ఏకాంతం లేనిదే..ఆత్మ పరిశీలన లేదు..
ఆత్మపరిశీలన లేనిదే.. మోక్షం లేదు..
ఒక వ్యక్తిగా..
ఒక కుటుంబంగా
ఒక సమాజంగా..
మొత్తం మానవ ప్రాథమ్యాలను
తరచి చూసుకోవాల్సిన సమయమిది..
సలపరమెడుతున్న గాయాలను
నయం చేసుకోవడానికి..
ప్రకృతి తనకు తాను కల్పించుకున్న
స్వల్ప విరామమిది..
భూమిపై మానవ ఉనికిని
కాడుకోవడానికి..
ప్రకృతి ప్రసాదించిన నిర్బంధ
స్వల్ప విరామమిది..
6 ఏప్రిల్, 2020.