అంబారావం..
అంబారావం..| ఫణీంద్ర కుప్పిలి
అనగనగా ఒక రాజ్యంలో కొందరు మహా మేధావులు రాజు దగ్గరికి వెళ్లి..' ప్రభూ..మన రాజ్యంలో జీవహింస విపరీతంగా పెరిగిపోయింది.. సంస్కృతీ సంప్రదాయాలు మట్టిలో కలిసిపోతున్నాయి. అందువలన తమరు తక్షణం పశు వధ పై నిషేధం విధించాలని ప్రార్థించారు..' అప్పటికే విచిత్రమైన ఆజ్ఞలతో పేరు సంపాదించుకున్న ఆ రాజు వెంటనే ' తన రాజ్యంలో ఎవరు పశువుని వధించినా వారి తల తీసేయబడుతుంది ' అంటూ రాజాజ్ఞని జారీ చేశాడు.. దాంతో రాజ్యంలోని పశువులన్నీ సంబరాలు చేసుకోవాలని నిర్ణయించుకున్నాయి.
ఆ ప్రారంభోత్సవ సభకి రాజుని ముఖ్య అతిథిగా ఆహ్వానించాయి..ఆ సభలో రాజు పశువులు హక్కుల గురించి గొప్పగా ప్రసంగించాడు.. ప్రసంగం చివర్లో రాజు ' నా రాజ్యంలో ఒక మనిషికి అన్యాయం జరిగితే.. అరగంట లేటుగా వస్తానేమో..కానీ అదే ఒక ఆవుకి అన్యాయం జరిగితే అరక్షణం లో ఉంటాను ' అని తొడగొట్టి..మీసం మెలేసి డైలాగు చెప్పడం తో అక్కడున్న పశువులన్నీ తోకలెత్తి.. '..అంబా..అంబా..' అంటూ హర్షధ్వానాలు తెలియజేశాయి..
అప్పటికే చాలా సంవత్సరాలుగా వర్షాలు లేక కరువు కోరల్లో చిక్కుకున్న రైతులు.. కనీసం పశువులకు గడ్డి..నీరు కూడా కరవు అవుడంతో.. తమకి బాధకలిగించినప్పటికీ.. చేసేది లేక తమ పశువుల్ని తెగనమ్ముకుని.. పొట్ట చేత పట్టుకొని వేరే ప్రాంతాలకు వలసపోయేవారు.. ఇపుడు పశువుల్ని అమ్ముకోడానికి వీలు లేకపోవడంతో చేసేది లేక ఉన్నదాంట్లోనే.. తాము కొంత తిని..పశువులకు ఏదో ఒకటి పెడుతూ రోజుల్ని భారంగా నెట్టుకొస్తున్నారు..అయితే కరువు తీవ్రత పెరిగిపోవడంతో.. ఇక పశువుల్ని సాకటం మా వల్ల కాదు అంటూ ధర్నాలు.. రాస్తారోకోలు చేయడంతో.. పశువుల కోసం జిల్లాకో సంక్షేమ హాస్టల్స్ ని ప్రారంభించాల్సిందిగా రాజు ఆదేశించాడు..
అయితే పశువులు ఎక్కువ అయిపోవడంతో రాజు మొదలెట్టిన హాస్టల్స్ అన్నీ కిక్కిరిసిపోసాగాయి.. దాంతో అక్కడ అడ్మిషన్ కోసం విపరీతంగా సిఫార్సులు.. లంచాలు మొదలయిపోయాయి.. పశువుల హాస్టల్స్ కి గల డిమాండ్ ని గమనించిన కొన్ని కార్పొరేట్ సంస్థలు.. విపరీతంగా పశువుల హాస్టల్స్ ని స్థాపించడం జరిగింది.. పాపం సామాన్య రైతుల పశువులకు ప్రభత్వ హాస్టలలో ప్రవేశం దొరకకపోవడంతో. ఉన్నకాడికి తమ ఆస్తుల్ని అమ్ముకునో... అప్పలు చేసో.. ఈ కార్పొరేట్ 'రాహువు..కేతువు..' సంస్థల్లో అడ్మిషన్లకై క్యూలు కట్టసాగేరు..ఇలా రైతులు కష్టాలు కొనసాగుతుండగా..
మరోవైపు ఈ ఆశ్రమాలు..సంక్షేమ హాస్టల్స్ లో సేద దీరుతున్న పశువుల కాలక్షేపం కోసం అప్పటికే ఎలక్ట్రానిక్ ఛానెల్స్ని నడుపుతున్న ఓ ప్రముఖ సంస్థ " గో టీవీ " పేరుతో రెండు తెలుగు సామంత రాజ్యాలలో 24 గంటల ప్రసారాలు మొదలెట్టింది.. అలాగే..వివిధ పశువుల సమస్యల్ని హైలెట్ చేయడానికి గంట గంటకి " అంబారావం " పేరుతో వార్తల్ని ప్రసారం చేయసాగింది.. తెలుగు సామంత రాజ్యాలలో ఈ ఛానెల్స్ క్లిక్ కావడంతో వెంటనే.." గో టీవీ- ఒరియా, గోటీవి-హిందీ.." ఇలా అన్ని భాషల్లో తన ఛానెల్స్ ని మొదలెట్టింది.. దాంతో రాజ్యంలోని అన్ని మీడియా సంస్థలు.. పశువులకై ప్రత్యేక ఛానెల్స్ మొదలెట్టేసాయి.. కాంపిటీషన్ పెరిగిపోవడంతో పశువులకు కూడా 'రియాలిటీ షో'లని నిర్వహించసాగారు.. ఇలాంటి షోలకై మనుషుల్లోనే 'పశువుల్లాంటి వాళ్ళని జాగ్రత్తగా సెలెక్ట్ చేసి..' వ్యాఖ్యాతలుగా నియమించుకున్నారు..
ఇలా పశువుల సంతతి పెరిగిపోవడంతో.. వాటి సంక్షేమం కోసం రాజ్యంలో.. ఒక ప్రత్యేకంగా ఒక మంత్రిని నియమించాల్సి వచ్చింది..రోజు రోజుకి పెరిగిపోతున్న ఖర్చుతో.. ఖజానా ఖాళీ అవ్వసాగింది.. దాంతో రాజుకి పిచ్చెక్కి.. " అసలు ఈ సలహాను ఇచ్చిన మహామేధావుల్ని నాముందు హాజరు పరచండి " అంటూ రాజు ఆజ్ఞాపించాడు..
బారెడు పొద్దెక్కింది..తొందరగా లేవరా..." ఇందాక నుండి మన పశువులు..బెడ్ కుడితి కోసం..ఒకటే అరుస్తున్నాయి " 😀😀 అని మా అమ్మ తట్టి లేపడంతో.. కళ్ళు పులుముకుంటూ కుడితి బకెట్ కై వెతక సాగాను...
అనగనగా ఒక రాజ్యంలో కొందరు మహా మేధావులు రాజు దగ్గరికి వెళ్లి..' ప్రభూ..మన రాజ్యంలో జీవహింస విపరీతంగా పెరిగిపోయింది.. సంస్కృతీ సంప్రదాయాలు మట్టిలో కలిసిపోతున్నాయి. అందువలన తమరు తక్షణం పశు వధ పై నిషేధం విధించాలని ప్రార్థించారు..' అప్పటికే విచిత్రమైన ఆజ్ఞలతో పేరు సంపాదించుకున్న ఆ రాజు వెంటనే ' తన రాజ్యంలో ఎవరు పశువుని వధించినా వారి తల తీసేయబడుతుంది ' అంటూ రాజాజ్ఞని జారీ చేశాడు.. దాంతో రాజ్యంలోని పశువులన్నీ సంబరాలు చేసుకోవాలని నిర్ణయించుకున్నాయి.
ఆ ప్రారంభోత్సవ సభకి రాజుని ముఖ్య అతిథిగా ఆహ్వానించాయి..ఆ సభలో రాజు పశువులు హక్కుల గురించి గొప్పగా ప్రసంగించాడు.. ప్రసంగం చివర్లో రాజు ' నా రాజ్యంలో ఒక మనిషికి అన్యాయం జరిగితే.. అరగంట లేటుగా వస్తానేమో..కానీ అదే ఒక ఆవుకి అన్యాయం జరిగితే అరక్షణం లో ఉంటాను ' అని తొడగొట్టి..మీసం మెలేసి డైలాగు చెప్పడం తో అక్కడున్న పశువులన్నీ తోకలెత్తి.. '..అంబా..అంబా..' అంటూ హర్షధ్వానాలు తెలియజేశాయి..
అప్పటికే చాలా సంవత్సరాలుగా వర్షాలు లేక కరువు కోరల్లో చిక్కుకున్న రైతులు.. కనీసం పశువులకు గడ్డి..నీరు కూడా కరవు అవుడంతో.. తమకి బాధకలిగించినప్పటికీ.. చేసేది లేక తమ పశువుల్ని తెగనమ్ముకుని.. పొట్ట చేత పట్టుకొని వేరే ప్రాంతాలకు వలసపోయేవారు.. ఇపుడు పశువుల్ని అమ్ముకోడానికి వీలు లేకపోవడంతో చేసేది లేక ఉన్నదాంట్లోనే.. తాము కొంత తిని..పశువులకు ఏదో ఒకటి పెడుతూ రోజుల్ని భారంగా నెట్టుకొస్తున్నారు..అయితే కరువు తీవ్రత పెరిగిపోవడంతో.. ఇక పశువుల్ని సాకటం మా వల్ల కాదు అంటూ ధర్నాలు.. రాస్తారోకోలు చేయడంతో.. పశువుల కోసం జిల్లాకో సంక్షేమ హాస్టల్స్ ని ప్రారంభించాల్సిందిగా రాజు ఆదేశించాడు..
అయితే పశువులు ఎక్కువ అయిపోవడంతో రాజు మొదలెట్టిన హాస్టల్స్ అన్నీ కిక్కిరిసిపోసాగాయి.. దాంతో అక్కడ అడ్మిషన్ కోసం విపరీతంగా సిఫార్సులు.. లంచాలు మొదలయిపోయాయి.. పశువుల హాస్టల్స్ కి గల డిమాండ్ ని గమనించిన కొన్ని కార్పొరేట్ సంస్థలు.. విపరీతంగా పశువుల హాస్టల్స్ ని స్థాపించడం జరిగింది.. పాపం సామాన్య రైతుల పశువులకు ప్రభత్వ హాస్టలలో ప్రవేశం దొరకకపోవడంతో. ఉన్నకాడికి తమ ఆస్తుల్ని అమ్ముకునో... అప్పలు చేసో.. ఈ కార్పొరేట్ 'రాహువు..కేతువు..' సంస్థల్లో అడ్మిషన్లకై క్యూలు కట్టసాగేరు..ఇలా రైతులు కష్టాలు కొనసాగుతుండగా..
మరోవైపు ఈ ఆశ్రమాలు..సంక్షేమ హాస్టల్స్ లో సేద దీరుతున్న పశువుల కాలక్షేపం కోసం అప్పటికే ఎలక్ట్రానిక్ ఛానెల్స్ని నడుపుతున్న ఓ ప్రముఖ సంస్థ " గో టీవీ " పేరుతో రెండు తెలుగు సామంత రాజ్యాలలో 24 గంటల ప్రసారాలు మొదలెట్టింది.. అలాగే..వివిధ పశువుల సమస్యల్ని హైలెట్ చేయడానికి గంట గంటకి " అంబారావం " పేరుతో వార్తల్ని ప్రసారం చేయసాగింది.. తెలుగు సామంత రాజ్యాలలో ఈ ఛానెల్స్ క్లిక్ కావడంతో వెంటనే.." గో టీవీ- ఒరియా, గోటీవి-హిందీ.." ఇలా అన్ని భాషల్లో తన ఛానెల్స్ ని మొదలెట్టింది.. దాంతో రాజ్యంలోని అన్ని మీడియా సంస్థలు.. పశువులకై ప్రత్యేక ఛానెల్స్ మొదలెట్టేసాయి.. కాంపిటీషన్ పెరిగిపోవడంతో పశువులకు కూడా 'రియాలిటీ షో'లని నిర్వహించసాగారు.. ఇలాంటి షోలకై మనుషుల్లోనే 'పశువుల్లాంటి వాళ్ళని జాగ్రత్తగా సెలెక్ట్ చేసి..' వ్యాఖ్యాతలుగా నియమించుకున్నారు..
ఇలా పశువుల సంతతి పెరిగిపోవడంతో.. వాటి సంక్షేమం కోసం రాజ్యంలో.. ఒక ప్రత్యేకంగా ఒక మంత్రిని నియమించాల్సి వచ్చింది..రోజు రోజుకి పెరిగిపోతున్న ఖర్చుతో.. ఖజానా ఖాళీ అవ్వసాగింది.. దాంతో రాజుకి పిచ్చెక్కి.. " అసలు ఈ సలహాను ఇచ్చిన మహామేధావుల్ని నాముందు హాజరు పరచండి " అంటూ రాజు ఆజ్ఞాపించాడు..
బారెడు పొద్దెక్కింది..తొందరగా లేవరా..." ఇందాక నుండి మన పశువులు..బెడ్ కుడితి కోసం..ఒకటే అరుస్తున్నాయి " 😀😀 అని మా అమ్మ తట్టి లేపడంతో.. కళ్ళు పులుముకుంటూ కుడితి బకెట్ కై వెతక సాగాను...